Friday, July 5, 2024

TS | మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడికి బెయిల్‌

ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రహీల్‌కు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం చెంచల్ గూడ జైలులో ఉన్న రహీల్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున రెండు షూరిటీలు ఇవ్వాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం రహీల్‌ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement