Friday, September 20, 2024

RBI | యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు ఝ‌ల‌క్

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మంగళవారం) భారీ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలను పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ, కేవైసీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోవడంతో యాక్సిస్‌ బ్యాంక్‌పై రూ.1.91 కోట్లు ఆర్‌బీఐ జరిమానా విధించింది.

అదేవిధంగా డిపాజిట్లపై వడ్డీ, బ్యాంకు రికవరీ ఏజెంట్లు, బ్యాంక్‌ కస్టమర్‌ సర్వీసులకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా వేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. చట్టపరమైన, నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ రెండు బ్యాంకులకు మొత్తం రూ.2.91 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బిఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement