Tuesday, September 17, 2024

Madhya Pradesh : ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ట్రక్కు ఢీకొని ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఇవాళ‌ తెల్లవారుజామున ఛతర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఇటీవలే పడవ ప్రమాదం కారణంగా 11మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఏడుగురు స్పాట్‌లోనే దుర్మరణం చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement