Monday, September 16, 2024

TG | మహిళా జర్నలిస్టులపై దాడి… డీజీపీకి ఫిర్యాదు

నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది. రైతు రుణమాఫీపై గ్రౌండ్‌ రిపోర్టుకు వెళ్లిన వారిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు కొట్టి, దాడి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో టీడబ్ల్యూజే ప్రతినిధులు డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు.

మహిళలపై భౌతికంగా దాడి చేశారని…. జర్నలిస్టుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేక్కోన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరారు.

ఈ అంశంపై స్పందించిన డీజీపీ జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement