Tuesday, October 22, 2024

Athletics | 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్స్‌లో భారత్..

పారిస్ ఒలంపిక్స్ పురుషుల స్టీపుల్ చేజ్ ఈవెంట్‌లో భారత్ ఫైన‌ల్స్ కు చేరింది. నేడు జ‌రిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ భార‌త్ కు చెందిన అవినాష్ సేబుల్ ఫైనల్‌కు చేరాడు. స్టీపుల్‌చేజ్ హీట్ 2లో ఉన్న అవినాష్ 8:15.43 సెకన్ల టైమింగ్‌తో ఐదవ స్థానంలో నిలిచి ఫైన‌ల్స్ కు అర్హ‌త సాధించాడు.

కాగా, పురుషుల స్టీపుల్‌చేజ్ హీట్స్‌లో మొత్తం 36 మంది పోటీదారులు పాల్గొనగా… 12 మంది అథ్లెట్లతో మూడు గ్రూపులుగా విభజించారు. కాగా, ఒక్కో హీట్‌లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు చేరుకుంటారు. ఇక 3000 మీటర్ల పురుషుల స్టీపుల్‌చేజ్ ఫైన‌ల్స్ ఆగ‌స్ట్ 8 న జ‌ర‌గనుంది.

హాంగ్‌జౌ 2022 ఆసియా క్రీడల్లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో అవినాష్ స్వర్ణం సాధించాడు. అదేవిధంగా రేసును 8:19.53 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త ఆసియా రికార్డును నెలకొల్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement