ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలు కీలక చర్చలు జరిపారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. పార్టీ సమిష్టిగా ప్రజల ముందుకు వెళ్లాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సూచించారని తెలిపినట్టు ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ పేర్కొన్నారు.
ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున.. ఆగస్టు 15న ప్రభుత్వం తరపున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖలకు తెలియజేసినట్లు తెలిపారు.
ఆగస్టు 14న ఢిల్లీలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు పార్టీ శ్రేణులకు అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ తెలియజేస్తారని, కేజ్రీవాల్ సూచనలతో పార్టీ సమిష్టిగా ముందుకు సాగుతుందని గోపాల్ రాయ్ తెలిపారు.