Thursday, October 17, 2024

Archery | ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట.. క్వార్టర్స్ లోకి జట్లు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట ఆరంభమైంది. ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నాలుగో స్థానంలో నిలిచి ఇప్ప‌టికే క్వార్టర్ ఫైన‌ల్స్‌కు అర్హత సాధించ‌గా.. తాజాగా ప‌రుషుల జ‌ట్టు కూడా క్వార్ట‌ర్స్కు చేరుకుంది. నేడు (గురువారం) జ‌రిగిన టీమ్ క్వాలిఫైడ్ ఈవెంట్ లో 2013 పాయింట్లతో మూడ‌వ‌ స్థానంలో నిలిచింది. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త ప‌రుషుల జ‌ట్టు టాప్‌-3లో నిలిచింది.

వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర నాలుగో సీడ్‌ను కైవసం చేసుకున్నాడు. ధీరజ్ 681 పాయింట్లతో అత్యధిక ర్యాంక్ సాధించిన భారతీయుడుగానిలిచాడు. ఇక తరుణ్‌దీప్ రాయ్ 674 పాయింట్లతో 14వ స్థానంలో… ప్రవీణజాదవ్ 658 పాయింట్లతో 39వ స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియాకు చెందిన డబ్ల్యూ జే కిమ్ (686) , జేడీ కిమ్ (682) వ్యక్తిగత ర్యాంకింగ్ తెలి రెండు స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement