Tuesday, September 17, 2024

AP – భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళం

అమరావతి: ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్టు భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement