కరోనా కేసుల కట్టడికి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నీ అమలుచేస్తోంది. దీంతో బ్యాంకుల పనివేళలు కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.00గంటల నుంచే బ్యాంకులు పనిచేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుల బిజినెస్ సమయం ఉదయం 9.00నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని, సాయంత్రం 4.00గంటల వరకు అవి తమ పనిచేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, కర్ఫ్యూ నుంచి పోర్టులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెసలుబాటు ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement