Wednesday, September 25, 2024

AP – నటి జత్వానీ కేసు – విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా …

అమ‌రావ‌తి – ఎపిలో సంచలనం సృష్టించిన ముంబై సినీనటి కాదంబరి జత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 1 వరకు విశాల్ గున్నీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదపరి విచారణను అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement