Friday, September 20, 2024

AP CM – ఒకటో తేదీన మడకశిర లో చంద్ర బాబు పర్యటన

శ్రీ సత్యసాయి బ్యూరో జూలై 28( ప్రభన్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత జిల్లా యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 1న సత్యసాయి జిల్లా మడకశిర కు సీఎం చంద్రబాబు తొలి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఆదివారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మ తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఏం ఎస్ రాజు , ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా ఎస్పీ రత్నా, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు , ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement