Monday, September 16, 2024

Delhi | హ‌స్తిన‌లో చంద్ర‌బాబు.. కాసేప‌ట్లో ఆ మంత్రితో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా, ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. 7 గంటలకు జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశం కానున్నారు. రాత్రి ఎంపీలతో విందు సమావేశంలో పాల్గొంటారు.

పేప‌టి షెడ్యూల్…

ఇక రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. రేపు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరకముందు ఆయనతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అంశంపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement