Thursday, October 17, 2024

ఎలాంటి ప్రసవం జరిగినా.. ఆరోగ్య ఆసరా : సీఎం జగన్

ఎలాంటి ప్రసవం జరిగినా.. ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్య శ్రీ, నాడు-నేడు కింద చేపడుతున్న పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. ఇకపై ఆరోగ్య శ్రీ డబ్బులు నేరుగా ఆస్పత్రులకు కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement