Wednesday, October 23, 2024

Paris Olympics | భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ద‌క్కింది. భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. ఫైనల్ చేరడంలో విఫలమైన అమన్ శుక్రవారం జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన డేరియన్ క్రూజ్‌తో త‌ల‌ప‌డిన అమన్ 13-5 పాయింట్ల తేడాతో గెలిచాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 6కి చేరగా.. ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement