Thursday, October 24, 2024

TG | సిరాజ్‌కు జుబ్లీహిల్స్ లో ఇంటిస్థలం… ఉత్తర్వులు జారీ

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ గెలిచి నగరానికి చేరుకున్న సిరాజ్‌.. ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా టీమ్ ఇండియాలో తెలంగాణ నుంచి ఆడుతున్న ఏకైక క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తాజాగా శుక్రవారం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో సిరాజ్ కు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement