Friday, October 18, 2024

America : టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం – ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం

అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్‌ సమీపంలో స్టేట్‌ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.

మృతుల్లో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని చిత్తూరు వాసులుగా టెక్సాస్‌ పబ్లిక్‌ సేఫ్టీ వర్గాలు గుర్తించాయి. ఇద్దరు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని రాండాల్స్ సమీపంలో రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సంతాపం తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement