Wednesday, October 23, 2024

AP | కనకదుర్గమ్మను దర్శించుకున్న కూటమి నాయకులు

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) – విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కూటమి నాయకులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేశ్, విజయవాడ ఎం.పీ కేశినేని చిన్ని, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తదితరులు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ఆలయ అర్చకులు, వేద పండితులు , ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఈ ఓ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని దుశ్శాలువతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement