Saturday, September 7, 2024

All Set – సింగరేణి పరీక్షలకు సర్వం సిద్ధం – అభ్యర్థులకు సూచనలు చేసిన సిఎండి బలరాం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – సింగరేణి సంస్థ లో గత మార్చి నెల 1 వ తేదీన విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన లో భాగంగా మొత్తం 10 కేటగిరీలలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈనెల 20, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను(సీబీటీ) నిర్వహిస్తున్నట్లు వివరించారు

పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ డి సి ఐ ఎల్ వారి ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్ జంట నగరాల్లో 12 పరీక్ష సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అలాగే మోసగాళ్ల వలలో పడొద్దని, శ్రమను నమ్ముకొని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తే వారి వివరాలను కంపెనీ విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా యాజమాన్యం అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది.

 అభ్యర్థులు ఒకరోజు ముందే తమ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి.

 పరీక్షకు గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.  పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయబడతాయి

.  అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు తీసుకురావాలి

. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల పరీక్షకు ముందు, తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించడం జరుగుతుంది

. అడ్మిట్ కార్డులో తెలిపిన సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు.

 అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లైతే హెల్ప్ డెస్క్ నెం. 08744-249992 ను సంప్రదించవవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement