Monday, September 16, 2024

TG | వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌గా కోదండరెడ్డి

  • విద్యా కమిషన్‌ చైర్మన్‌గా అకునూరి మురళి
  • బీసీ కమిషన్‌కు గోపిశెట్టి నిరంజన్‌
  • సభ్యులుగా రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో కోదండరెడ్డి రెండేళ్ళపాటు కొనసాగుతారు.

అలాగే విద్యా కమిషన్‌ చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అకునూరి మురళిని ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న గోపిశెట్టి నిరంజన్‌ నియమితులయ్యారు.

సభ్యులుగా రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మిలను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement