Saturday, September 7, 2024

TG | దానం, కడియం అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి… కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టుకు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement