Monday, July 1, 2024

TG | నార్సింగి ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం… ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన వాహనదారులు… క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరికొందరు బస్సులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్రేన్ సహాయంతో బస్సును తొలగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement