Thursday, September 5, 2024

Accident – బస్సు – లారీ ఢీ : తొమ్మిది మంది దుర్మరణం

ఆంధ్రప్రభ స్మార్ట్ – బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement