Sunday, October 6, 2024

Accident – లారీ – బైక్ ఢీ – ఒకరి మృతి

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేలాపూర్ జగదంబ ఆలయానికి పాదయాత్ర కు వెళ్లి.. బైక్ పై తిరిగి వస్తుండగా పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న ఐచర్ లారీని బైక్ ఢీ కొట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో అదిలాబాద్ శాంతినగర్ కాలనీకి చెందిన హర్షవర్ధన్ (17) అనే యువకుడు తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

బైక్ వెనుక కూర్చొని ఉన్న ఇదే కాలానికి చెందిన మరో యువకుడు నీరజ్ తీవ్ర గాయాలతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. వీరిద్దరూ ఇంటర్ విద్యార్థులే. మృతి చెందిన హర్షవర్ధన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement