Wednesday, October 9, 2024

Iltija Mufti : ఓటమిని అంగీకరిస్తున్నా..

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పీడీపీ కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత్రి మెహబూబా కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా పై పోటీ చేసిన ఇల్తిజా .. 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నానని ఇల్తిజా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రచార సమయంలో బిజెహర ప్రజలు తనపై చూపిన ప్రేమ, మమకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, ప్రచారంలో తనతోపాటు కలిసి పార్టీకోసం కష్టపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆ పార్టీ నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. అక్కడ కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి హవా కొనసాగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement