Friday, October 18, 2024

Delhi | జైలు నుంచి విడుదలైన ఆప్ నేత సత్యేంద్ర జైన్..

ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ రావడంతో శుక్రవారం సాయంత్రం ఆయ‌న జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కాగా, బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయంపై సత్యేంద్ర జైన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది సత్యానికి దక్కిన విజయమని అభివర్ణిస్తూ ‘సత్యమేవ జయతే’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేంద్ర జైన్‌కు ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement