Friday, October 18, 2024

ఉరి వేసుకుని యువకుడు మృతి

నర్సంపేట, (ప్రభ న్యూస్):ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన పట్టణం లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వెల్లుల్లా గ్రామానికి చెందిన జోగా ప్రణయ్(21) లక్నెపల్లి గ్రామంలోని బాలాజీ నర్సింగ్ కళాశాలలో బి ఎస్సి మూడవ సంవత్సరం కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువుతున్నాడు.గత నెల క్రితం కళాశాల వసతి గృహం నుండి బయటికి వచ్చి అద్దె గదిలో ఉంటూ కళాశాలకు వెళ్ళేవాడు.

కళాశాల వెళ్లి వచ్చిన అనంతరం తను నివాసం ఉండే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. స్నేహితుడు ఎంతకు బయటికి రాకపోవడం గమనించి చూడగా ఉరి వేసుకుని ఉండటం గమనించి తలపులు బద్దలు కొట్టి కళాశాల కు చెందిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించగా మృతదేహన్ని మార్చురిలో భద్రపరిచారు.ఫిర్యాదు అందలేదని,అందితే మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్సై రవీందర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement