Friday, September 20, 2024

Budget | గరిటె తిప్పిన నిర్మలా సీతారామన్..

జూలై 23న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్-2024 ముసాయిదా ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోని నార్త్ బ్లాక్‌లో సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా అధికారులందరికీ హల్వా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రతిసారీ బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఫైనాన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని బేస్‌మెంట్‌లో ఈ కార్యక్రమం జ‌రుగుతుంది. కాగా, దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి కల్పిస్తారు. బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement