Saturday, October 5, 2024

Bihar | తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు

తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపిన ఉదంతం సింఘౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెగుసరాయ్​లో పచ్చంబ వార్డు నంబర్ 17కి లో సింగ్ భార్య నూతన్ దేవి (45) నివాసముంటుంది. ఆమెకు ఆనంద్​కుమార్​, అనుభవ్​ కుమార్​ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి నుంచి ఆలయానికి పూజల నిమిత్తం వెళ్లగా.. ఆమెను పట్టుకొని గదిలో బంధింది ఇటుకలు, రాయితో తలపై మోది కొట్టి చంపాడు. నూతన్​ దేవి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గదికి వేసిన తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే చనిపోయింది. నిందితుడు ఆనంద్ కుమార్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే ప్రజలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు సింఘాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. సింఘౌల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement