Saturday, October 5, 2024

Gujarat | కుప్ప కూలిన భవనం… శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు

గుజరాత్‌లోని సూరత్‌లో అరంత‌స్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా, శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు.

స్థానిక ఎమ్మెల్యేతోపాటు సూరత్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు ఒక మహిళను రక్షించారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారో ఇంకా తెలియరాలేదు. సహాయక సిబ్బంది జేసీబీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సాయంత్రం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫ్లడ్‌లైట్లతో ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement