Saturday, September 21, 2024

Punjab | వరదలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి

పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ సరిహద్దు సమీపంలో బలమైన నీటి ప్రవాహం కారణంగా ఉనా జిల్లాలోని దేహ్లా గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. హిషియార్ పూర్ జిల్లా మహల్‌పూర్‌కు పెళ్లి కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారుతో పాటు అందులో ఉన్న వారంతా వరదలో కొట్టకుని పోయారు.

పంజాబ్‌లోని బెజో ఖాడ్‌లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారిలో 8 మంది మృతి చెందారు. కారుతో పాటు వారి మృతదేహాలను బయటకు తీసారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement