Tuesday, October 1, 2024

TG | ప్రజావాణిలో 575 దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల పర్వం కొనసాగింది. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 575 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 185, హౌసింగ్‌ కు సంబంధించి 64దరఖాస్తులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 50, పంచాయితీ రాజ్‌ కుచెందినవి 43, హోం శాఖకు సంబంధించినవి 191 దరఖాస్తులు నమోదు అయ్యాయి. ప్రజావాణి ప్రత్యేక అధికారి,మున్సిపల్‌ శాఖ సంచాలకులు దివ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరించి ఫైల్‌ నంబరు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement