Friday, September 13, 2024

TG | వర్షం భీభత్సంతో 117 గ్రామాలకు రాకపోకలు బంద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో తెలంగాణలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆయా గ్రామాలకు వెల్లే రహదారులు కొట్టుకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 117 గ్రామాలకు భాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆయా గ్రామలకు వెల్లే రాహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని పేర్కొంది. అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 33 గ్రామాలకు వెల్లే రహదారులు దెబ్బతినగా, కరీంనగర్‌లో 20 గ్రామాల రోడ్లు పాడయ్యాయి. 20 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

మహబూబాబాద్‌లో 30 గ్రామాలు, ఉమ్మడి మెదక్‌ లో 8 గ్రామాలకు, నిజామాబాద్‌ లో 7 గ్రామాలకు, నల్గొండ లో 4 గ్రామాలకు వెల్లే రహదారులు కొట్టుకపోయాయి. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం మేరకు మొత్తం 117 గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి.

చాలా గ్రామాలు నీట మునగడంతో గ్రామాల్లో ఇంటర్నల్‌ రోడ్ల డామెజ్‌ను అధికారులు అంచనా వేయలేకపోయారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దెబ్బతిన్న గ్రామీణ రోడ్లపై స్పష్టత వస్తుందని రూరల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ ప్రాంత రహదారుల పునురుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టాక దెబ్బతిన్న రోడ్ల అంచనాలు సిద్దం చేసి మరమత్తులు చేపట్టాలని ఆదేశాలు జారిచేశారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా తాత్కలిక ప్రాతిపదికన గ్రామీణ రహదారుల మరమ్మత్తులు చేపట్టి..పునరుద్దరణ పనులను పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఈఎన్సీ కనకరత్నం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement