Monday, September 16, 2024

హైదరాబాద్ : మంత్రులు, ఎమ్మెల్యేలతో నేడు కేసీఆర్ భేటీ

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవి పేరును సీఎం కేసీఆర్ ఖ‌రారు చేసిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో వాణీదేవి నేడు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. వాణీదేవి నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఈ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌తో భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి వాణీదేవి కూడా హాజ‌రు కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement