Sunday, September 8, 2024

‘శ్రీకారం’ ఆడియో ఫంక్షన్‌లో గాయపడ్డ వ్యక్తి మృతి

రెండు రోజుల క్రితం ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ‘శ్రీకారం’ మూవీ ఆడియో ఫంక్షన్‌‌లో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవిని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరగడంతో శివ అనే అభిమాని తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా మృతుడు శివ ఖమ్మంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన వాసి అని, అతడు వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement