Tuesday, September 17, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 11, 610 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11, 610 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 100 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,55,913కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1, 36, 549 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement