ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. మునుపు ఎన్నడూ లేనంతగా గోల్డ్ ధర ఎక్కువ అవుతుంది. గోల్డ్ రేట్.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.109,820లకి చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,668లకి చేరింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.128,730ఉంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి.
భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.109,790ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,641గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.128,700గా ఉంది.
విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.109,790 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,641గా ఉంది. వెండి కేజీ ధర రూ.128,700గాఉంది.
ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 109,430, 22 క్యారెట్ల ధర రూ.100,311లుగా ఉంది. వెండి కిలో ధర రూ.128,280లుగా ఉంది.
ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర109,620, 22 క్యారెట్ల ధర రూ.100,485లుగా ఉంది. వెండి కిలో ధర రూ.128,500లుగా ఉంది.
చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.109,940ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,778గా ఉంది. వెండి కిలో ధర రూ.128,870గా ఉంది.

