జన్నారం, జూన్ 13 (ఆంధ్రప్రభ): విధుల్లో నిర్లక్ష్యం వహించారని అభియోగం మేరకు మంచిర్యాల జిల్లా జన్నారం జీసీసీ మేనేజర్ భుక్య బాలాజీని ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా శుక్రవారం సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఆదేశాల ప్రతిని డీఎం కార్యాలయం ద్వారా జన్నారం జీసీసీ కార్యాలయానికి పంపించినట్లు ఉట్నూర్ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ తెలిపారు.
గత ఐదు నెలల క్రితం వేమనపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగాయని, హాస్టల్ కు సరఫరా చేసిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించాలరని సమాచారం. అక్కడి హాస్టల్ బియ్యాన్ని ఆ ప్రాంత వాసులు పట్టుకోగా, చర్చనీయాంశమైన విషయం విధితమే. విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు స్థానిక మేనేజర్ బాలాజీని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో అక్కడి వార్డెన్ ను గతంలో ఉట్నూర్ పీఓ కుష్బూ గుప్తా సస్పెన్షన్ చేశారు.