ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విద్యార్థులకు బ్లాంకెట్స్, స్వెటర్లను పంపిణీ చేశారు.
గురువారం రాత్రి భూపాలపల్లి జంగేడు లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహం విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మీతో కలిసి ఎమ్మెల్యే జిఎస్ఆర్ స్వయంగా బ్లాంకెట్స్, స్వెటర్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు అన్ని సౌకర్యాలతో అభ్యసించగల వాతావరణాన్ని కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను సాధించాలని సూచించారు.

