Friday, September 6, 2024

AP: చంద్ర‌బాబుకు విజ‌యోస్తు… పురాణపండ శ్రీనివాస్ సారథ్యంలో జయ జయోస్తు ప్రచురణ

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న‌ నేపథ్యంలో విజయోస్తు అంటూ కిమ్స్ ఆస్పత్రి చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య రెండు అపురూప మంగళ గ్రంథాలను సిద్ధంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను అద్భుతంగా తీర్చిదిద్దనున్న చంద్రబాబుకు దైవబలం అండగా ఉండాలనే సంకల్పంతో నారసింహో.. ఉగ్రసింహో.., జయ జయోస్తు పేరుతో ఈ గ్రంథాలను తీర్చిదిద్దారు.

ఈ పవిత్ర కార్యాన్ని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ భుజస్కంధాలపై వేసుకున్నారు. చంద్రబాబు దంపతుల ఫోటోలు ఒక వైపు ప్రచురించి… మిగిలిన పూర్తిభాగం దైవీయ స్పృహతో ఉండేలా వీటిని ప్రచురించారు. నరసింహ భగవానుని కటాక్షం నారా చంద్రబాబు దంపతులకు పుష్కలంగా ఉండాలని బొల్లినేని ఈ మహోత్తమ కార్యానికి శ్రీనివాస్ చేత శ్రీకారం చుట్టించారు. ఈ పవిత్ర గ్రంథాలను చంద్రబాబు దంపతులకు ఆయన అపురూప కానుకగా అందివ్వనున్నారు.

నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చెయ్యడానికి ముందే ఇలా అక్షరాలతో మంగళ స్వరాలు శ్రీమయంగా అందిస్తున్న బొల్లినేని కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభినందిస్తున్నాయి. పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘మహా మంత్రస్య’ అనే అపురూపపు మహా గ్రంథాన్ని ఐదేళ్ల నాడు అమరావతిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ఆవిష్కరించి ప్రేమపూర్వకంగా అభినందించడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement