Saturday, June 29, 2024

ఋషభుని యోగ సిద్ధత్వం!

జంబూ ద్వీపంలోని ఒక వర్షమునకు అధిపతి అయిన నాభి ఋత్వి క్కులతో కలసి సంతానం కొరకు యాగం చేసాడు. అంత విష్ణువు ప్రత్యక్షమై నాభి మహారాజు, భార్య మేరుదేవిని ఆశీర్వదించి స్వ యంగా తానే మీ బిడ్డగా జన్మిస్తానని వరమిచ్చి యజ్ఞ వేదికలో అంతర్థాన మయ్యాడు. కొంతకాలానికి వారి కుమారునిగా జన్మించాడు. శిశువు వెలు గులు వెదజల్లుతూ అత్యంత పరాక్రమవంతునిగా కనబడసాగాడు. అంత నాభి ఆ శిశువుకు ఋషభు డు అని నామకరణం చేసాడు.
పెరిగి పెద్ద వాడయిన ఋషభుడు సకల శాస్త్ర పారంగతుడైనాడు. వేదవేదాంగాలను కరతలామ లకం చేసుకున్నాడు. నాభి మహారాజు అతనిని పట్టా భిషక్తుని గావించాడు. సమస్త జనులు ఋషభుని సేవించసాగారు. ఋషభుని ఖ్యాతి దశదిశలా వ్యా పించసాగింది. ఇది గ్రహించిన ఇంద్రుడు జంబూ ద్వీపమంతా వర్షం లేకుండా చేసాడు. తన దివ్యదృ ష్టితో తెలుసుకున్న ఋషభుడు తన యోగ మాయ తో రాజ్యమంతటా వర్షం కురిపించాడు. ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి కర్మతంత్రాన్ని పాటించ పూనుకొని దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నా డు. వారికి నూరుగురు కుమారులు కలిగారు. వారి లో పెద్దవాడు భరతుడు. ఇతని పేరు మీదనే ఈ భూమండలమంతా ”భర తవర్షం”గా పేరు గాంచింది.
ఋషభ మహారాజు భరతునికి పట్టం గట్టాడు. అంత భరతుడు తన సోదరులలో కుశావర్తుడు, ఇలావక్తుడు బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయ కేతువు, భద్రసేనుడు, ఇంద్ర స్పృశుడు. విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని ప్రధానులుగా నియమించాడు.
మరొక తొమ్మిదిమంది సోదరులు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధు డు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, చమనుడు, కరభాజనుడు అనువారు భాగవత ధర్మాన్ని వ్యాప్తిచేసి పరమ భాగవతోత్తములైనారు. వారందరికీ వేదసారాన్ని, హరిభక్తిని, వేయి యాగాలను చేసి, ధర్మ మార్గాన్ని ప్రబోధిం చిన ఋషభుడు యోగసిద్ధుడై తన అవతారాన్ని చాలించాడు. సృష్టి ధర్మా న్ని, రహస్యాన్ని తన కుమారులకు, ప్రజలకు వివరించాడు.
సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వాటికంటే సర్పాలు శ్రేష్ఠతరాలు. వాటి కంటే మేధావులు ఉత్తములు. మేధావులకంటే పరిపాల కులు గొప్పవారు. వారికంటే సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారి కంటే దేవతలు గొప్పవారు. దేవతలలో ఇంద్రాది దిక్పాలకులు మరిం త ఉన్నతులు. వీరందరికంటే మునులు పరమశ్రేష్ఠులు. వీరందరిపై రుద్రు డు, బ్రహ్మ, విష్ణువు వరుసగా ఘనశ్రేష్ఠులు. అందు విష్ణువు బ్రహ్మజ్ఞానుల ను ఆదరిస్తాడు. మానవులకు బ్రహ్మజ్ఞాని దైవంతో సమానం. బ్రహ్మజ్ఞాను లను పూజించినవారు భూలోకంలోనే మోక్ష మార్గాన్ని తెలుసుకుంటారు.
ఈవిధంగా సదాచార సంపన్నులైన తన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను ఋషబుడు ఉపదేశించాడు. ఆయన తన నూరు మంది కుమారులలో పెద్దవాడు, పరమ భాగవతోత్త ముడు అయిన భరతునికి రాజ్యాభిషేకం చేసి రాజ్య పరిపాలనా భారాన్ని అప్పగించాడు. అనంతరం దిగంబరుడై, కేశ సంస్కారాలను విడనాడి పిచ్చివానిలా ప్రవర్తిస్తూ అగ్నిని తనలో ఆరోపించుకొని బ్రహ్మవర్త దేశాన్ని వదలి వెళ్ళిపోయాడు. అటుపై అవధూతలా మౌనవ్రతంతో నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, కొండలు, ఋష్యాశ్రమాలు దాటి సాగిపోయా డు. చివరకు అతను ఎవరూ గుర్తు పట్టని రీతిలో ఉన్నాడు. చివరకు అతని జీవన విధానం జుగుప్స కలిగించే తీరులోకి మారిపోయింది. నేలమీద పడి న ఆహార పదార్థాలను తినడం తన మలమూత్రాలలో పొరలుతూ ఉండ డం చేస్తూ ఉండేవాడు. అయితే ఋషబుని మలమూత్రాలు సుగంధభరిత మై పదిదిక్కులలో, పది ఆమడల దూరం వరకూ పరిమళాలను వెదజల్లు తూ ఉండేది. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడై వెలుగొందసాగాడు. అపుడు ఆకాశగమ నం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్థానం, దూరదర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు ఋషబుణ్ణి ఆవహించాయి. అయినా ఋష భుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు.
ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనసు మళ్ళీ ఏదోవిధంగా బలహీనతకు లోనై కోరికలను తీర్చుకోవడానికి విజృంభిస్తుంది. దీర్ఘకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సును కూడా మనస్సు హరిస్తుంది. అందు వల్ల జ్ఞానులు మనస్సును నమ్మరు. ఋషబుడు కూడా అదేవిధంగా మనస్సును నమ్మక సిద్ధు లను స్వీకరించలేదు.
అటు తరువాత ఋష భుడు పరమహంసయై, భగవంతుని సమానుడై దేహాభిమానాన్ని వదలి తన లింగ శరీరం వదలిపె ట్టాడు. కానీ పూర్వ వాసనా ఫలితంగా దేహ సంచల నం ఆగలేదు. అనేక దేశాలు, ఖండాలు దాటి శిలా ఖండాలను నోటిలో నుంచుకొని దిగంబరంగా కుట క పర్వత ప్రాంతాన్ని చేరాడు. అక్కడ వృక్షాల రాపి డికి చెలరేగిన అగ్నిశిఖలలో ఋషభుడు దగ్ధమైపో యాడు. ఈ దృశ్యాన్ని చూసిన అర్హతుడనే ఆ ప్రాంత పరిపాలకుడు ఋషభుని గురించి తెలుసుకుని ఆయన బోధలను, సంస్కారాలను ఆమోదించి ఆ యననుసరించి, ప్రజలందరిచే అనుసరింపచేసాడు.
కలియుగంలో మానవులు అధములై మాయ వలన మోహం వల్ల శాస్త్రాలలో చెప్పబడిన శౌచాల ను, ఆచారాలను వదలి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానాలు మాని అపవి త్ర వ్రతాలను చేస్తారు. బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మజ్ఞానులను యజ్ఞ పురుషులనూ నిందిస్తారు. తమతమ ధర్మాలు గొప్పవని చాటుకుం టూ అంధ విశ్వాసాల కు లోనవుతారు. రజోగుణం ప్రబలిపోయి వితండ వాదన చేస్తారు. అటు వంటి అంధ విశ్వాస మానవులకు కర్మ సంబంధంలేని మోక్ష మార్గాన్ని ప్రబోధించాడు ఋషభ దేవుడు. అటువంటి ఋషభుని చరిత్ర వింటే చాలు వారు భక్తి తత్పరులై హరినామ స్మరణతో మోక్షాన్ని పొందుతారు. సప్త సముద్రాల చేత చుట్టబడిన ఈ వసుం ధరలోని వారందరికీ ఋషభ దేవుడు పరమ పూజ్యుడని శుక మహర్షి వివరించాడు.
సాక్షాత్తు విష్ణువు అంశ అయిన ఋషభ దేవుని కుమా రుడే భరతుడు. ఒకనాటి జంబూ ద్వీపాల సముదాయమే ఈ భూమండలం. ఈ సమస్త భూమండలాన్ని పరిపా లించిన చక్రవర్తే భరతుడు. ఆ జంబూ ద్వీపాంతర్గత నాభి ప్రదేశమే మన భారతదేశం. ఇటువంటి భరత ఖండంలోని ప్రజలు, సమస్త జీవరాసులు, వృక్షము లు, నదీనదాలు, పర్వతాలు, అణువణువూ పరమ ప విత్రమైనవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement