Wednesday, October 9, 2024

కాలానికి …మాయకు ఎవరూ అతీతులు కారు!

మన పాపకర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే.. కర్మ అత్యంత బలీ యమైనది. అది ఎంత బలంగా వుంటుందో తెలియజేస్తుంది పరీక్షిత్తు మహారాజు జీవితం. పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. అదే సమ యంలో గొప్ప మంత్రవేత్త అయిన కశ్యపుడనే బ్రా#హ్మణోత్తముడు, రాజును సంరక్షింప, రాజ ప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.
తక్షకుడు కూడా బ్రాహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి ”మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం?” అని అడిగాడు.
”ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్ర మహమను వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడ్తున్నాను” అంటూ దాప రికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.
”అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిత్తు మహారాజుని కాటువేయబోయేది ఏదో నీటిపా మో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధి పుడు తక్షకుడే స్వయంగా అయితేనో?” అన్నాడు.
”తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గార డీవాడి పాము మంత్రమో, విష కీటక మంత్రమో అనుకుంటున్నావా” అని ప్రశ్నించాడు.
”అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని” అని నిజరూపం చూపించాడు తక్షకుడు.
అంతట కశ్యపుడు, ”సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్ర#హం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విష#హర మంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢ విశ్వాసం!” అని అన్నాడా కశ్యపుడు.
”అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టును చూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్క పెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు!” అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.
కశ్యపుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో అబద్ధంలేదు. ఆ మహా విష కీలలకు చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, ”అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!” అని ఆ భస్మరాశి నుంచి పిడికెడు బూడిదను తీసుకుని, అత్యంత శ్రద్ధాభ క్తులతో అధిష్ఠాన మంత్ర జపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రో క్షించి విడిచినాడు. చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహతంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యు డు కాడని సర్పరాజుకి అర్థమైంది.
వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని ”మహామంత్ర ద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో… లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూ ర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలి ప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షితుని అంకం పరిసమాప్తం కా వాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు!”
”ఇంతకూ తమకు కావలసింది…” అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ”ధనమ య్యా! ధనం!” అన్నాడు కశ్యపుడు.
”అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీ పరం చేస్తాను!” అని పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపి వేసినాడు.
ుుుుు
ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది. మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు! ఒక వేళ కశ్య పుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం. పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగ వంతుడు కూడా. ఎందుకంటే వాడి కర్మ కలిసి రావాలి. కశ్యపుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షితు మహారాజు పాపకర్మ అడ్డు పడినది. ఏమిటి ఆ పాప కర్మ?
ఒక ముని మీద చచ్చిన పామును వేయడం! మంచివారితో మహాత్ములతో చెలగాట మాడడం. కోరికోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు. రాజు, మునిశా పం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.
పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమి త్తమాత్రుడో, అదేవిధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్ర#హముల ప్రమేయం వుంటుంది. మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మ ఫలం అనుభవింప జేస్తాయి. నిజానికి ఏ గ్ర#హమూ మనల్ని ఏమీ చేయదు. మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. కర్మ బలీయమైనది.
”గోవిందా, నారాయణా, రామా, శివా! కాపాడు! కాపాడు!” అని ప్రార్ధిస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు ”ఓయి, నీవు ఎ ప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు!” నీ కర్మ అని అంటాడు. ”మన పుణ్యఫలం మన జాతకంలో గురు రూపంలో కనిపిస్తుంది. గురు అను గ్ర హం వున్నదా? గురు దృష్టి వున్నదా? శుభగ్రహ దృష్టి వున్నదా? వుంటే బ్రతికిపోతాము. లేదా బాధపడాలి, తప్పదు. పాపమంటే శరీరాన్ని, తద్వారా మనసును బాధ పెట్టడమే! మన సు బాధపడితే పాపకర్మ క్షయం అవుతుంది, సుఖపడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది .”
పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు. అదే అకర్మ, వికర్మ, సుకర్మ, నిష్కామ కర్మ. కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు. తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, ఆ పుణ్యమే మన సంతానాన్ని, వంశాన్ని కూడా కాపాడుతుంది. మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటివాడు కూడా మాయలో పడ్డాడు గదా! కలి పురుషున్ని నిలదీసిన వాడు కూడా అ#హంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడినవాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయటపడలేదు? అదే కర్మఫలం, కాల మహమ. కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారని గమనించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement