Sunday, September 22, 2024

నరసింహ న్యాయము

నర అంటే నరు డు. సింహ అంటే సింహము, హంసించే ది అని అర్థము. నరసింహా లేదా నారసింహ అంటే నరు డూ, సింహం కలిపి కనిపించే రూ పం లేదా అవతారమని సామాన్య అర్థము. ఈ నరసింహావతారాన్ని శ్రీ నారసింహుడు, నరహరి, నరసింహ మూర్తి, నరసింహుడు అనే పేర్లతో పిలు స్తారు. సాధు రక్షణ, దుష్ట శిక్షణకు త్రిమూ ర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు యుగయు గాన ఎన్నో అవతారాలలో అవతరించాడు. అం దులో ముఖ్యమైనవి దశావతారాలు. అందులో నాల్గవ అవతారమే నారసింహావతారము.
ఆధ్యాత్మిక వాదులు నరసింహ అవతారము ను త్రిమూర్త్యాత్మకమని అంటారు. పాదాల నుం చి నాభి వరకు బ్రహ్మ రూపము. నాభి నుండి కం ఠం వరకు విష్ణు రూపము. కంఠం నుండి శిరస్సు వరకు రుద్ర స్వరూపంగా నృసింహస్వామిని వర్ణించారు. మామూలుగా చూసినట్లయితే రెం డు రూపాల్లో కనిపిస్తాడు. పాదాల నుండి కంఠం వరకు నరత్వం. కంఠం పైభాగం సిం#హత్వం నిం డి ఉంటుంది. శ్రీమహావిష్ణువు నరసిం#హునిగా అవతారం దాల్చి ఏంచేశాడో క్లుప్తంగా పూర్వాప రాలు తెలుసుకుందాం.
భక్తుని మాటను నిజం చేయడాని కి, తన సేవకుడిని శాప విముక్తి గావించడానికి నర సింహ అవతారములో అవతరించాడు. భక్తుని మాట, సేవకుని శాప విమోచ నం రెండూ ఒకదానికొకటి సంబం ధం ఉన్నాయి. అదెలాగో తెలియాలంటే సేవకుడి గురించి ముందుగ తెలుసుకోవాలి.
జయ విజయులు అనే వారు వైకుంఠంలో శ్రీమహా విష్ణువు ద్వారపాలకులు. ఒకసారి సనకస నందనాది మునులు శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చినప్పుడు సరైన సమయం కాదని అడ్డ గిస్తారు. మునులైన మమ్మల్నే అడ్డగిస్తారా? ఈ విష్ణు లోకానికే దూరమై బతుకుదురు గాక అని శపించడంతో విష్ణువు దగ్గరకు వెళ్ళి శాప విముక్తి చేయమని శరణు కోరతారు. మునుల శాపానికి తిరుగులేదు కాబట్టి మీరు భక్తులుగా ఐతే ఏడు జన్మలు. విరోధులుగా ఐతే మూడు జన్మలలో మీ కు శాప విమోచనం అవుతుంది. కాబట్టి రెండింటి లో ఏది నచ్చితే అలా జన్మించమని చెప్పగానే విరో ధులుగా 3 జన్మలెత్తి శాప విముక్తి పొంది మీ చెంత కు చేరుకుంటామని అంటారు.
అలా కృతయుగంలో హరణ్యాక్ష, హరణ్య కశిపులుగానూ, త్రేతాయుగంలో రావణ, కుంభక ర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల, దంత వక్త లుగా జన్మించి ప్రతి జన్మలో విష్ణువు అవతారం చే త వధింపబడి శాప విముక్తి పొందుతారు. ఆవిధం గా కృతయుగంలో జయ, విజయులు కశ్యప ప్రజా పతికి, దితికి హరణ్యాక్షుడు, హరణ్యకశిపుడుగా జన్మిస్తారు. #హరణ్యకశిపుడు అంటే బంగారు పడక మీద పడుకునే వాడని అర్థం. అంటే భోగలాలసత కలిగినవాడు. శ్రీమహావిష్ణువు వరా#హమూర్తి అవ తారంలో జయుడైన హరణ్యాక్షుని వధిస్తాడు. సో దరుడి మరణానికి చింతిస్తూనే ఘోర తపస్సు చేసి బ్ర#హ్మ నుండి తాను ”గాలిలో, ఆకాశంలో, భూమి పై గాని, నీటిలో, అగ్నిలో గాని, రాత్రి, పగలు గాని దేవదానవ మనుష్యులచే, జంతువుల చేత, ఆయు ధముల చేత, ఇంటా బయటాగాని మరణం వుండ కూడదనే వరాన్ని పొందుతాడు. ఇక ఆ తర్వాత తనకు ఎలాంటి మరణ భ యం లేదనే వర గర్వం తో విర్రవీగుతూ ఎన్నో అకృత్యాలు చేస్తూ విష్ణువునే చంపేందుకు వెదుకుతూ వుంటాడు.
#హరణ్యకశిపుడి కొడుకు

ప్రహ్లాదు డు పుట్టుకతోనే మహా విష్ణువు భక్తు డిగా పేరు పొందుతాడు.
విష్ణు ద్వేషి అయిన #హర ణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చండా మార్కులనే గురువు వద్దకు పం పిం చి విష్ణు స్మరణ మాన్పించేందుకు ప్ర యత్నం చేస్తాడు. ఎన్నో విద్యలు నేర్చు కున్నా విష్ణు నామస్మరణమానని ప్రహ్లాదు డిని అనేక రకాలుగా #హంసిస్తాడు. కుమారు డితో ఓ రోజు ”ఎక్కడ ఉన్నాడు రా నీ హరి? చూపించు” అని అడిగితే ”ఇందుగలడందు లేడను సందే#హమువలదు చక్రి” అంటూ సమా ధానం చెబుతాడు. అది రాత్రి పగలు కాని సమ యం గడప లోపల బయటా కాని స్థలం. అక్కడే ఉన్న స్తంభాన్ని చూపి ఇందులో విష్ణువును చూప కుంటే నీ తల తీయిస్తాను. అప్పుడు నీ #హరి అడ్డు పడతాడా? అంటూ స్తంభాన్ని చేతితో చరచగానే నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవి స్తాడు. ఉగ్ర నరసిం#హమూర్తియై గడప మీద కూ ర్చుని తొడలమీద హరణ్యకశిపుడిని పడేసి గోళ్ళ తో చీల్చి సం#హరించి తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటను నిజం చేస్తాడు.
ఈ అవతారం ద్వారా చెప్పేదేమిటంటే మనుషుల్లో లోలోపల మృగ స్వభావం ఉం టుంది. ఆ స్వభావం పైకి విజృంభించినప్పు డు ఆ వ్యక్తి విచక్షణ కోల్పోయి మృగంలా ప్రవర్తిస్తాడు. తద్వారా అతనికి ఎదుటి వారికి అనేక నష్టాలు కష్టాలు కలుగుతా యి. కాబట్టి ఆ స్వభావం కూడదు. మానవుడిగా నైతికతతో జీవిస్తూ, జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఆనం దంగా బతకాలి ఇదే ”నర సిం#హ న్యాయము” లోని అంతరార్థము.

Advertisement

తాజా వార్తలు

Advertisement