Monday, October 7, 2024

Manikonda – భక్తి శ్రద్ధలతో ఘనంగా చండీయాగం

హైదరాబాద్ – మణికొండ లో ని పంచవటి కాలనీ శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీశ్రీశ్రీ లలితాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఐదవరోజైన నేడు మహాచండి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు,

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహాచండి యాగం నిర్వహించారు .వేదపండితులతో నిర్వహించిన యాగం లో పెద్ద సంఖ్యంలో భక్తులు తమ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేసారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement