Wednesday, September 25, 2024

ఉద్ధవునికి శ్రీకృష్ణుని ఉపదేశం!

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో ”అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అత్యంత ముఖ్య సఖుడు, ఆంతరంగిక భక్తుడు.
ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ”కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకు న్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపా ము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టు కోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతింతో నిరంతరమూ నీతో ఉండేటట్లు ఉపదేశించు” అన్నాడు.
అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయము లను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మనం అందరం తెలుసుకు ని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసం గం. దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.
”ఉద్ధవా! నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఆలోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలోనున్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశి స్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమైన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వరూ తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం చేయరు.
కోర్కెలు, అపారమైన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము, కోర్కెల వలన వ్యాధులు వస్తా యి. అవి ఆయుర్దాయమును తగ్గిస్తాయి.
కలియుగంలో ఉండే మను ష్యులకు రానురాను వేద ము ప్రమాణము కాదు. కోట్ల జన్మల

అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టి న వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.
అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మర చిపోతారు. తద్వారా బ్ర#హ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సం స్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూప మును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువై పుకే తొందరగా అడుగువేస్తారు. ఇంద్రియములకు వశులయిపోతా రు? రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏరకంగా ఆర్జించాడన్నది కాక, ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్న దో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహా పురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగం లో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కా నీ, మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సా#హము ను చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుం డా #హనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును యిస్తు న్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడుచేయడానికి వచ్చినదని గుర్తుపెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్ల యితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!
కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టు కోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. అదే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నిం చు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్ర#హము, చేయుట, ఈశ్వరు ని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.”
ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం. ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement