Thursday, September 19, 2024

ప్రజ్ఞానం బ్రహ్మ!

నిజానికి నీరు చల్లగా వేడిగాను ఉండ టం నీటి స్వభావం కాదు. నీటి గు ణం ఎప్పటికి ఒకేవిధంగా ఉంటుం ది. కానీ చల్లదనం కానీ వేడిదనం కా నీ సమయానుకూలంగా నీటికి కలిగే ఒక తాత్కాలిక మార్పు. ఈ మార్పు నీరు వుండే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. మన గదిలో ఉన్న నీరు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటుంది. కానీ అదే నీరు మనం వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత పెరిగి వేడిగా మారుతుంది అప్పుడు మనం వేడి నీరు అని అంటాము. నిజానికి వేడి అనేది నీటి తత్త్వం కాదు. అది కేవలం అగ్నితత్వం. ఎంతసేపైతే అగ్ని నీతితో అనుసంధానం అయి ఉంటుందో అంతవరకూ వేడి నీరు అని నీరు పిలవబడుతుంది. నిజానికి వేడి నీరు ఎల్లప్పుడూ వేడి నీరు కాదు అది నీటిలో వేడి వున్నం తవరకు మాత్రమే వేడి లక్షణం చూపెడుతుంది. అసలు విషయానికొస్తే- మానవుడు దశ ఇంద్రియాలతో ఉండి జీవన వ్యా పారం చేస్తుంటారని మనందరికీ తెలుసు. దశ ఇంద్రియాలం టే ఐదు కర్మేంద్రియాలు, (కర్మేంద్రియ పంచకం: వాక్కు పాణి పాదం పాయువు ఉపస్థ, జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు- చర్మం, చక్షువు- కన్ను, రసన- నాలుక, శ్రోతం- చెవి, ఘ్రాణం- ముక్కు) కర్మేంద్రియాలు పనులు చేస్తుం టాయి జ్ఞానేంద్రియాలు బా#హ్య ప్రపంచ జ్ఞానాన్ని మన కు అందిస్తూ వుంటాయి. ఇక్కడ ప్రశ్న యేమని ఉదయి స్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని ఎవరికి అంది స్తున్నాయి. రెండు కర్మేంద్రియాలు వాటి వాటి పనులు ఎవరి పర్యవేక్షణలో చేస్తున్నాయి. ఈ రెం డు ప్రశ్నలు కూడా సాధారణ జ్ఞానానికి అందనివి.
ఏ రకంగా నీటిలో అగ్ని ఉండి నీటిని వేడి నీరు అని పిలిపిస్తున్నదో అదే విధంగా శరీరంలో ఆత్మ ఉండి శరీరాన్ని పరోక్షంగా నడిపిస్తున్నది. అంతరంగంలో ఉండి శరీరాన్ని నియంత్రించి శరీరా నికి వేడిని అందిస్తున్నది. ఏరకంగా నీటిలో అగ్ని తొలగిన తర్వాత నీరు వేడినీరుగా పిలువబడదో అదేవిధంగా ఈ శరీరంలో వేడి తొలగిన తరువాత జీవుడిగా పిలువబడదు. అప్పుడు శరీరం ఉన్నా కూడా శరీరపు జీ వ లక్షణాలు కనిపించవు. కేవలం పార్దవం (మట్టిగా) మాత్రమే అవుతుంది. సాధకుడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యం తెలుస్తుం దో అప్పుడు అతని స్ఫురణకు వచ్చే విషయం ఏమిటం టే ఈ శరీరంలో జీవ వ్యాపారాలు వేడి వున్నంతవర కు మాత్రమే జరుగుతాయి. ఎప్పుడైతే వేడి చల్లారిపో తుందో అప్పుడు శరీరం నిశ్శేష్టలతో మిగిలిపోతుంది.
శరీరంలో వున్న ఆత్మ ఈ సృష్టికి మూలకారణం అయినా పరమాత్మ తత్త్వమయి ఒకటిగానే భాసిల్లు తున్నదని మన మ#హర్షులు వారి మేధాసంపత్తితో గాంచి మనకు వారి జ్ఞానాన్ని ఉపనిషత్తుల రూపంలో ప్రసాదించారు. సాధకుడు ఈ శరీరం అశాశ్వితమని ఎ ప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు శాశ్వితము, నిత్యం, అనంతమైన బ్రహ్మపదాన్ని చేరుకోవాలని అభిలషి స్తాడు.
ఉపనిషత్తులో ”ప్రజ్ఞానం బ్ర#హ్మ” అనే మహావాక్యం ఇదే తెలుపుతుంది. ఈ మహా వాక్యం ప్రకారం జన్మను కలిగి ఉండటమే బ్ర#హ్మ అని అర్ధం. అంటే బ్ర#హ్మకు సంబంధించిన జ్ఞా నం కలగటం అన్నమాట. నిర్వికల్ప వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడు మనస్సు ప్రశాంతత చెంది బ్ర#హ్మము సర్వము అనే భావనలోకి వస్తాడు. సాధన సంపత్తితో ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని తర్వాత వైరాగ్యాన్ని పొందితే ఆత్మ జ్ఞానం తప్పకుండా కలుగు తుంది. జీవన్ముక్తి దొరుకుతుంది. కాబ ట్టి సాధక ఈ క్షణమే మేలుకో నీ గమ్యం వైపు అడుగులు వేయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement