Saturday, October 19, 2024

కాశీలో ప్రముఖ ఘాట్లు

పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులూ నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనా ల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవో పేతంగా వెలుగొందింది? కానీ మొహమ్మదీయ దండ యాత్రీకులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరువాత వున్న కాశీని మనం చూస్తున్నా ము. విశ్వనాథ, బిందు మాధవతోపాటు ఎన్నో మంది రాలను కూల్చి మసీదులు కట్టారు నేటికీ విశ్వనాథ మంది రంలో నంది మజీదు వైపు గల కూల్చబడిన మందిరం వైపు చూస్తుంటుంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది.
సర్వ పాపహరణం, మోక్షప్రదాయకం కాశీవిశ్వేశ్వరుని దర్శనం, గంగానదీ స్నానం. కాశీ క్షేత్రంలో వున్న అత్యం త ప్రధానమైన ఘాట్లలో స్నానం చేయడం పుణ్యప్రదం.
కాశీలో గంగమ్మ నదీ తీరాన 84 ఘాట్లు వున్నాయి ఇందులో దేవతలు,ఋషులు,రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఘాట్లు ఏమిటో తెలుసుకుందాం.
1, దశాశ్వమేధఘాట్‌ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వ మేధ యాగం చేసినది ఇక్కడే.. రోజు సాయకాలం విశేష మైన గంగా హారతి జరుగుతున్నది.
2, ప్రయాగ్‌ ఘాట్‌ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతిలు కలుస్తాయి
3, సోమేశ్వర్‌ ఘాట్‌ చంద్రుడు చేత నిర్మితమైనది.
4,మీర్‌ ఘాట్‌ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది
5,నేపాలీ ఘాట్‌ పశుపతి నాథ్‌ మందిరం బంగారు కళశంతో నేపాల్‌ రాజులూ కట్టినాడు
6, మని కర్ణికా ఘాట్‌ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్‌ చేస్తారు .ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించ లేడట.
7, విష్వేవర్‌ ఘాట్‌ ఇప్పుడు సిందియా ఘాట్‌ అంటా రు ఇక్కడే అ#హల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు
8, పంచ గంగా ఘాట్‌ ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి
9, గాయ్‌ ఘాట్‌ గోపూజ జరుగుతున్నది
10, తులసి ఘాట్‌ తులసీదాస్‌ సాధన చేసి రామా చరిత మానస్‌ లిఖించమని శివుని ఆదేశం పొందినది
11,హనుమాన్‌ ఘాట్‌ ఇక్కడ జరిగే రామ కథ వినడా నికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్‌ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.
12, అస్సి ఘాట్‌ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది
13,హరిశ్చంద్ర ఘాట్‌ సర్వం పోగొట్టుకొని హరి శ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరీ క్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది
14,మానస సరోవర్‌ ఘాట్‌ ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది
15,నారద ఘాట్‌ నారదుడు లింగం స్థాపించాడు.
16, చౌతస్సి ఘాట్‌ ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయు నికి ప్రీతి గల స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.
17. రానా మహల్‌ ఘాట్‌ ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుడిని తపస్సు చేసి ప్రసన్నుడిని చేసుకున్నాడు
18, అహల్యా బాయి ఘాట్‌ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీ లోని గంగా నది ప్రవా#హంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భ éవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement