Monday, September 23, 2024

AP | జయజయోస్తు.. మరో రెండు గ్రంథాల పునర్ ముద్రణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమర్ధవంతమైన పాలన అందించాలని ఆశీర్వదిస్తూ వారి ఆశీర్బలంగా వారిద్దరి ముఖచిత్రాలతో జయజయోస్తు, నారసింహో.. ఉగ్రసింహో అనే రెండు రమణీయ గ్రంథాలను పునర్ముద్రిస్తున్నట్టు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ చెప్పారు.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవాడలో ఈ రచయితతో సమావేశమై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్ల మీదుగా రెండు పవిత్ర గ్రంథాలను రూపొందించాలని పురాణపండ శ్రీనివాస్‌ని కోరారు. అంతేకాకుండా ఈ అపురూప దైవీయ చైతన్యపు గ్రంథాలపై వారద్దరి చిత్రాలను ప్రచురించాలని కూడా అభ్యర్ధించారు. ఆగస్టు పదిహేనో తేదీన అమరావతి, విజయవాడలలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులందరికీ ఈ గ్రంథాలను ఉచితంగా అందించనున్నట్టు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement