Thursday, September 19, 2024

నేడు ముచ్చింతల్‌కు అమిత్‌షా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరా బాద్‌ పర్యటన ఖరారైంది. మంగళ వారం మధ్యాహ్నం ఢిల్లిd నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.40గం.లకు శంషాబాద్‌ చేరుకోనున్నా రు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హోంమంత్రి అమిత్‌ షా రోడ్డు మార్గం లో ముచ్చింతల్‌ చేరుకోనున్నారు. శ్రీరామ నగరంలో రామానుజాచార్యుల విగ్రహ దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించ నున్నారు. అనంతరం యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రి 8గం.లకు ఢిల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement