Saturday, September 28, 2024

సకల పాపహరణం …హనుమంతేశ్వర దర్శనం!


శ్రీ రామచం ద్రుని పట్టాషే కం తర్వాత ఆం జనేయుడు రా మాజ్ఞ తీసుకొని గంధ మాదన పర్వతం చేరాడు. శ్రీరామ మంత్ర జపం చేసుకుంటూ జీవిస్తూ, చరితా ర్ధుడు అవుతున్నాడు. ఒకసారి ఆంజనేయస్వామికి ”తాను రామ రావణ యుద్ధంలో చాలామంది రాక్ష సులను సంహరించానని, దానివల్ల మహాపాతకం సంక్రమించిందని, దాన్ని పోగొట్టుకోవటానికి శివు ణ్ణి సందర్శించాల”ని కోరిక కలిగింది. తాను అనుకు న్నది ఆచరిస్తే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు స్వామి. వెనువెంటనే సీతారాములకు మనస్సులోనే నమస్కారం చేసుకున్నాడు. వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు.
అక్కడ నందీశ్వరుడు అడ్డుపడి ”హనుమా! నీ ఆలోచన మంచిదే. కాని బ్రహ్మ హత్యా పాతకంతో శివ దర్శనం దుర్లభం. పాపాలను పోగొ ట్టుకొని శివ దర్శనం చెయ్యి. నర్మదా నది అఘ విదారిణి. అక్కడ కొన్ని రోజులుండి ప్రతి నిత్యం స్నానం చేయడంతో పవిత్రుడవు కమ్ము. శివుని గురించి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు.” అని హతవు చెప్పా డు. ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి, దాని దక్షిణ ప్రాం తంలో ఉన్న సోమ నాథ దేవాలయానికి దగ్గరలో, ప్రశాంత వాతావర ణంలో ఉంటూ, స్నానం చేస్తూ శివ ధ్యానంతో తీవ్ర తపస్సు చేశాడు. ప్రణవాన్ని, పంచాక్షరిని ఏకాగ్ర చిత్తంతో జపించాడు. మనసును స్వాధీ నం చేసుకొన్నాడు.
పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయ్యా డు .”హనుమా! నీకు పాపం అంటుతుందా? పాపం ఎప్పుడో పోయింది. ఎప్పుడూ నువ్వు పవిత్రుడవే” అ న్నాడు. వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పారవశ్యంతో స్తుతి చేసి ప్రీతి కల్గించాడు. శివుడుహ నుమతో ”నీకు పాపాలు లేకున్నా, మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు. నీ తపస్సు.. ధ్యా నాలకు చాలా సంతృప్తి చెందాను. నువ్వు సర్వ దేవా త్మకుడవు. నీ నామాన్ని స్మరిస్తూ, జపిస్తూ, నిన్ను చూ స్తూ, అందరు సర్వదా శుభాలను పొందుతారు. హనుమ, అంజనీసుత, వాయుపుత్ర, మహాబల, పింగాక్ష, లక్ష్మణ ప్రాణదాత, సీతాశోక నివర్తకా” అని స్తుతిస్తూ అదృశ్యమైనాడు.
వాయుపుత్రుడు తాను తపస్సు చేసిన చోట సర్వ కోర్కెలను తీర్చే శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు. ”#హను మంత వనం” నిర్మించాడు. దానిలో అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పూల తీగెలు, బ#హువిధ ఫలములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు. జింకలు, గోరు వంకలు, చిలకలు, నెమళ్ళు, కోకిలలు మొదలైన పక్షి జా తులన్నీ వచ్చి చేరాయి. నందనవనాన్ని మించిన సౌందర్యంతో ఆ వనం శోభిస్తోంది. అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది. తపస్సుకు మిక్కిలి అను కూలంగా ఉంది. ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది. ఇదే ”హనుమంతేశ్వరం”. ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హరం సకల మనోభీష్ట సిద్ధి కలుగుతాయి అని పరాశర మ#హర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement