Saturday, September 21, 2024

శ్రీశైలానికి కార్తీక శోభ

శ్రీశైలం, ప్రభన్యూస్‌ : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీక రెండవ సోమవారం సం దర్భంగా భ్రమరాంబదేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు. భక్తులు పో-టె-త్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పరి సరాలు కిటకిటలాడాయి. వేకువజా మునే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నా నాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలి గించారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శిం చుకొని మొక్కులు చెల్లించుకున్నరు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు-కొని వేకువజామున 3.30గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, ప్రదోషకాల పూజలు నిర్వహిం చారు. 5.30 గంటలకు స్వామి, అమ్మ వార్ల దర్శనాలకు భక్తులను అనుమ తించారు.గర్భాలయంలో స్పర్శ దర్శనాలను నిలిపి వేశారు. శ్రీఘ్ర, అతి శీఘ్ర, ఉచిత క్యూలైన్లలో భారీగా భక్తులు బారులు తీరగా.. దర్శనానికి దాదాపు 5 గం టల వరకు సమయం పట్టిందని అధికారులు తెలి పారు ఆలయ కార్యనిర్వహణాధికారి. ఎస్‌ లవన్న. వారి ఆదేశాల మేరకు క్యూలైన్లలో భక్తులకు వేడి పాలు. బిస్కెట్లు-, అల్పాహారన్ని. అధికారులు అందిం చారు. అలాగే ఉదయం 10.30 గంటల భక్తులకు ఉచి త అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా ఉత్తరమాడ వీధి, గంగాధర మండపం వద్ద పెద్ద సం ఖ్యలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. పలు వురు భక్తులు లక్ష వొత్తుల నోములు సైతం నిర్వహిం చుకున్నారు. సుమారు లక్షకుపైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని ఆలయ అధికా రు లు తెలిపారు భక్తులకు ఇటు-వంటి ఇబ్బందులు కలవ కుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న ఎప్పటికప్పుడు స్వయంగా క్యూలైన్లను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement